Telangana |హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. దీంతో జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్రావతరణ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించున్నారు. ఈసీ అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.